Andhrapradesh, మే 4 -- ఏపీలో గత వారం రోజులగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండల తీవ్రత ఉండగా. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజుల పాటు కూడా ఇదే తరహా పరిస్థితులు ఉండున్నాయి.

ఇవాళ(ఆదివారం) ఏపీలోని పశ్చిమగోదావరి, ఏలూరుతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచే వర్షం మొదలు కాగా. పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. మరోవైపు విజయవాడ నగరంలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుసింది. దీంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. మరికొన్నిచోట్ల వర్షపు నీరు నిలచిపోయింది.

ఏపీలోని భిన్నమైన వాతావరణ పరిస్థితులు బుధవారం వరకు కొనసాగుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం వరకు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవ...