భారతదేశం, మే 18 -- కర్ణాటక కుంకీ ఏనుగులకు భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో అధిక డిమాండ్ ఉంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరాఖండ్‌ సహా అనేక రాష్ట్రాలకు కర్ణాటక కుంకీ ఏనుగులను పంపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఏనుగులకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఏడాది నుండి జరిగిన చర్చల తర్వాత ఇప్పుడు ఏపీకి ఆరు కుంకీ ఏనుగులు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌కు మే 21న 6 కుంకీ ఏనుగులను పంపించనున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె.శివవ్ తో ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంపై చర్చించారు. వీరి చర్చల ఫలితంగా ఆరు ఏనుగులు ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 8 కుంకీ ఏనుగులు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్థానికంగా వ్యతిరేకత రావడంతో ఆరు ఏను...