భారతదేశం, మే 21 -- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఏపీకి ఆరు ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అందించింది. బెంగళూరు విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సమక్షంలో కుంకీ ఏనుగులను అప్పగించారు. కుంకీ ఏనుగుల అప్పగింత, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పవన్ కల్యాణ్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...కుంకీ ఏనుగులు అందించిన కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సాయం అడిగినా కర్ణాటక ప్రభుత్వం ముందుకొస్తోందని చెప్పారు. ఏపీ, కర్ణాటక మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని పవన్‌ కల్యాణ్ ఆకాంక్షించారు. కుంకీ ఏనుగుల సంరక్షణకు ఏపీలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.

కుంకీ ఏనుగుల అప్పగింతపై ఏపీ, కర్...