భారతదేశం, ఫిబ్రవరి 10 -- విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని యూనిట్‌కు రూ.3.90కి తగ్గించాలన్నారు. ట్రూడౌన్‌ ఫలితాలు ప్రజలకే అందేలా చూడాలని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో నికర-సున్నా ఉద్గార విధానాన్ని అవలంబించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో విద్యుత్ కొరతను ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు విద్యుత్ మిగులు స్థితిని సాధించే దిశగా క్రమంగా ముందుకు సాగుతోందని అన్నారు.

'వేగవంతమైన సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టులు, పవన శక్తి, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, PM-KUSUM పథకాలు ప్రస్తుత అవసరం. కనీసం 1,000 ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తారు. ఇటీవల కుప్పంలో 5,000 కంటే ఎక్కువ ఈ-సైకిళ్లను పంపిణీ జరిగింది.' అని చంద్రబాబు అన్నారు.

ప్రజారోగ్య అవగాహనను సీఎం చంద్రబాబు నొక్క...