భారతదేశం, మే 18 -- తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. నేడు, రేపు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రాలు తెలిపాయి. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.

ఏపీలోని అన్నమయ్య, అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, శ్రీ సత్యసాయి, ఏలూరు, తూర్పు గోదావరి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడే కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది.

అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు వరద నీటితో పొంగిపొర్లుతున్నా...