Telangana, జూన్ 7 -- ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజుల పాటు వానలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. హెచ్చరికలను కూడా జారీ చేసింది.

అమరావతి వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం.. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కిమీ ఎత్తులో ద్రోణి బలహీనపడింది. అంతేకాకుండా ఉత్తర అంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా బలహీనపడింది. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో.... రెండు మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయి.

ఉత్తర కోస్తాలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల 40 - 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ...