భారతదేశం, ఆగస్టు 12 -- న్యూఢిల్లీ: దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో నాలుగు చిప్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల కోసం మొత్తం రూ. 4,594 కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
దేశంలో చిప్ తయారీకి ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ (India Semiconductor Mission) కింద ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ మిషన్ కోసం ప్రభుత్వం రూ. 76,000 కోట్లను కేటాయించింది.
కేంద్ర మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ, "ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్లలో నాలుగు సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది" అని చెప్పారు. ఈ ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.