భారతదేశం, ఏప్రిల్ 21 -- హైకోర్టుల స్థాయిలో సమగ్రత, వైవిధ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఏప్రిల్ 15, 19 తేదీల్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనను సోమవారం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

ఈ కొలీజియంలో సీజేఐతో పాటు ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.

కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ హేమంత్ చందనగౌడర్, జస్టిస్ సంజయ్ గౌడ, జస్టిస్ కె.నటరాజన్ లను బదిలీ చేయాలని సిఫార్సు చేశారు.

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.శ్రీసుధ, జస్టిస్ కె.సురేందర్, ఆంధ్రప్రదేశ్ హై...