భారతదేశం, జూన్ 6 -- రజనీకాంత్ కీ రోల్ ప్లే చేసిన 'లాల్ సలామ్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ బాట పట్టింది. శుక్రవారం (జూన్ 6) ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య డైరెక్టర్ కావడం గమనార్హం. ఎన్నో అంచనాలతో థియేటర్లకు వచ్చిన ఈ మూవీ దారుణంగా నిరాశపర్చింది. డిజాస్టర్ గా నిలిచింది.

'లాల్ సలామ్' మూవీ ఈ రోజే ఓటీటీలోకి వచ్చేసింది. స‌న్ నెక్ట్స్‌ ఓటీటీలో తమిళంలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 2024 ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైంది. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన లాల్ సలామ్ ఫిల్మ్ తీవ్రమైన పరాభవాన్ని ఎదుర్కొంది. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆడియన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. భారీ నష్టాలు చవిచూసింది.

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరక...