భారతదేశం, ఫిబ్రవరి 9 -- భారత ఐటీ రంగంలోని స్మాల్-క్యాప్ కంపెనీ బ్లూ క్లౌడ్ సోఫ్టెక్ సొల్యూషన్స్ (BCSSL) ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. కృత్రిమ మేధ (AI) ఆధారిత డేటా సెంటర్ల వ్యాపారం కోసం ఏకంగా 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,400 కోట్లు) భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించడంతో సోమవారం ఈ షేరు ఒక్కసారిగా రాకెట్లా దూసుకెళ్లింది.

సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో ఈ స్టాక్ 17.67 శాతం లాభపడి రూ. 21.30 స్థాయిని తాకింది. గత వారం ముగింపు ధర రూ. 18.10తో పోలిస్తే, నేడు ప్రారంభం నుంచే కొనుగోళ్ల జోరు కనిపించింది.

బ్లూ క్లౌడ్ సోఫ్టెక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, కంపెనీ దశలవారీగా 800 మెగావాట్ల (MW) సామర్థ్యం గల డేటా సెంటర్లను నిర్మించనుంది. దీనివల్ల దేశంలోని అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో కంపెనీ అగ్రస్థానంలో నిలవనుంది. ప్రధానంగా ఈ పెట్టుబడి కింది...