Andhrapradesh,telangana, ఆగస్టు 31 -- పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి సగటున 1.5, 5.8 కి.మీ ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. అంతేకాకుండా.. ఎల్లుండి వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి.
ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మూడు నాలుగు రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది.
ఇక తెలంగాణలో కూడా మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.