Andhrapradesh, మే 7 -- ఎయిమ్స్‌(ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌) మంగళగిరిలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 50 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌,అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌,అడిషనల్ ప్రొఫెసర్‌ ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు.

బయో కెమిస్ట్రీ, ఈఎన్ టీ, ఫ్యామిలీ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఫొరెన్సిక్ సైన్స్, మెడికల్ అంకాలజీ, మైక్రోబయాలజీ, అప్తామాలజీ, అర్తోపెడిక్స్, పిడియాట్రిక్, ఫార్మాకాలజీ, సైకియాట్రీ, రెడియాలజీ, రెడియోథెరపీ, పాథాలజీతో పాటు మరికొన్ని విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీలు 32 ఉండగా. ప్రొఫెసర్‌ - 07, అడిషనల్ ప్రొఫెసర్‌- 03, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఖాళీలు 8 ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర...