భారతదేశం, జూలై 13 -- ఎమ్మెల్యీ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి జరిగింది. హైదరాబాద్ మేడిపల్లిలోని ఉన్న ఈ కార్యాలయం వద్ద జాగృతి కార్యకర్తలు ఆందోళనకు చెందారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. కార్యాలయంలోని ఫర్నిచర్‌, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు.

కార్యాలయంలో లోపల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనటంతో. తీన్మార్ మల్లన్న గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్నస్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆందోళనకారులను అదుపు చేశారు. గాల్లోకి కాల్పులు జరపటం చర్చనీయాంశంగా మారింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....