భారతదేశం, మే 2 -- మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వినూత్న ఆలోచన చేశారు. తన నియోజకవర్గం ప్రజలను కలిసేందుకు ఎమ్మెల్యే ఆన్ విల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆయనే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకొని.. పరిష్కారం చూపుతున్నారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

'ప్రజా జీవితంలో ఉన్నంత కాలం.. ప్రజాసేవకు పాటుపడుతూనే ఉంటా. నియోజకవర్గ ప్రజలు రాత్రీ పగలు తేడా లేకుండా తన క్యాంపు కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి కలచి వేసింది. వారి సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని రూపొందించా. వారానికి 3 రోజులపాటు అధికారుల బృందంతో ప్రజల వద్దకు వెళతా. అధికారుల సమక్షంలోనే ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తా' అని కార్యక్రమం ప్రారంభం సందర్భంగా కవ్వంపల్లి స్పష్...