భారతదేశం, ఏప్రిల్ 26 -- భారత్‌ సమ్మిట్-2025కు నిన్ననే రావాల్సి ఉండే.. కానీ కాశ్మీర్‌కి వెళ్లాను.. క్షమించండి.. అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ సమ్మిట్‌ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలన్న రాహుల్.. ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని వివరించారు. పదేళ్ల కిందటి నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని వ్యాఖ్యానించారు.

'మోడ్రన్‌ సోషల్‌ మీడియాతో అంతా మారిపోయింది. ఇప్పుడంతా మోడ్రన్‌ రాజకీయమే. ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. విపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదు. భారత్‌ జోడో యాత్రలో 4 వేల కిలోమీటర్లు నడిచా. కన్యాకుమారి నుండి పాదయాత్ర మొదలుపెట్టా. 10 రోజుల తర్వాత చూస్తే నాతో పాటు నడిచే వారి సంఖ్య పెరిగిపోయింది. ఈ యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా' అని ర...