భారతదేశం, మే 11 -- ఎన్టీఆర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఉలవపూడి పవన్, సరస్వతి దంపతులు కంచికచర్లలోని అరుంధతీ నగర్‍లో నివాసం ఉంటున్నారు. వీరికి వికాస్, వినయ్ అనే కవల పిల్లలు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో సరస్వతి తన ఇద్దరు పిల్లలను ఖమ్మం జిల్లా మడుపల్లిలో ఉంటున్న తన అక్క వద్దకు పంపింది.

ఆధార్ కార్డులో మార్పులు చేయాల్సి ఉందని, చిన్నారులను తిరిగి కంచికచర్ల తీసుకొచ్చారు. శనివారం స్థానికంగా ఉండే పిల్లలతో వినయ్ ఆడుకుంటున్నాడు. దొంగ, పోలీస్ ఆట ఆడుతూ దాక్కునేందుకు ఇంటిపైకి వెళ్లాడు వినయ్. అక్కడున్న బియ్యం డబ్బాలోకి దూరి మూత వేసుకున్నాడు.

మూత బలంగా వేసుకోవడంతో బియ్యం డబ్బా గొళ్లెం పడింది. దీంతో బాలుడు ఎంత ప్రయత్నించినా మూత తెరుచుకోలేదు. ఎంత సేపటికీ బాలుడు కనిపించకపోవడంతో వినయ్ తల్లిదండ్రులు చిన్నారి వెతకడం మెుదలుపెట్టారు. ఇంటి చుట్టుపక్కల, బంధువ...