భారతదేశం, మే 28 -- ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదని..తెలుగువారి ఆత్మ గౌరవం, పేదవారి గుండెల్లో తీపి జ్ఞాపకమని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం అంటే పాలకులు కాదు సేవకులని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.

సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అని నినదించి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్‌ ఎంతో కృషి చేశారన్నారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగువారికి పండుగ రోజని, ఎన్టీఆర్ స్పూర్తితో పేదరికం లేని సమాజం ఒక్క టీడీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు.

మహానాడు వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలుగు జాతి మొత్తం అభిమానించే, ఆరాధించే ఏక...