భారతదేశం, మే 7 -- అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ కూతురు అదితి శంక‌ర్ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ నేసిప్పాయా థియేట‌ర్ల‌లో రిలీజై మూడు నెల‌లు దాటినా ఇప్ప‌టివ‌ర‌కు ఓటీటీలోకి రాలేదు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఇన్నాళ్లు మేక‌ర్స్ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం కోలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావ‌డం అనుమాన‌మే అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఎట్ట‌కేల‌కు నేసిప్పాయా ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. ఈ రొమాంటిక్ యాక్ష‌న్ మూవీ స‌న్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. త్వ‌ర‌లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేస్తామ‌ని స‌న్ నెక్స్ట్ ప్ర‌క‌టించింది. నేసిప్పాయా మూవీ ఓటీటీలో త‌మిళంతో పాటు తెలుగులోనూ ఒకే రోజు రిలీజ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం.

నేసిప్పాయా మూవీ ద్వారా కోలీవుడ్ సీనియ‌ర్ హీరో ముర‌ళి ...