Hyderabad, ఏప్రిల్ 27 -- సమ్మర్ స్టార్ట్ అయింది. ఎండలు ముదురుపోతుండటంతో కాసేపు బయటకు వెళ్లొచ్చినా నీరసంతో ఇబ్బందిపడుతున్నాం. పెరిగిన ఉష్ణోగ్రతలు, బయట నుంచి వీచే వేడి గాలులు జీవనాన్ని కష్టతరం చేస్తున్నాయి. అలాంటి సమయంలో ఎండలో అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు, చల్లని నీరు త్రాగుదామని, చల్లని గాలి శరీరానికి తగిలితే బాగుంటుందని అనిపిస్తుంది. ఎండలోంచి వచ్చిన వెంటనే ఈ చల్లని వస్తువులు వెంటనే ఉపశమనం ఇస్తాయి. కానీ, అదే సమయంలో మీకు హానికరం కావచ్చని మీకు తెలుసా? అందుకే వేసవి కాలంలో ఎండలోంచి వచ్చిన తర్వాత వెంటనే కొన్ని పనులు చేయడం మానుకోవాలి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవి కాలంలో ఎండ వేడి కారణంగా గొంతు ఎండిపోతుంది. అలాంటి సమయంలో చల్లని నీరు అమృతంలా అనిపిస్తుంది. కానీ ఎండలోంచి వచ్చిన వెంటనే ఫ్రిజ్‌లోంచి చల్లని నీరు త్రాగడం మానుకోవాలి. ఇది ఆరోగ...