భారతదేశం, ఏప్రిల్ 29 -- ఏప్రిల్​ 22న జమ్ముకశ్మీర్​ పహల్గామ్​లో ఉగ్రవాదులు సృష్టించిన అరాచకాలకు సంబంధించిన కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే నాటి సంఘటనలకు సంబంధించిన ఒక లైవ్​ వీడియో తాజాగా సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది! ఓ పర్యాటకుడు జిప్​లైనింగ్​ చేస్తుండగా, ఉగ్రవాదుల కాల్పులకు చుట్టుపక్కన ప్రజలు పరిగెడుతుండటం, కొందరు కుప్పకూలడం ఆ వీడియోలో రికార్డు అయ్యాయి.

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి భయానక క్షణాలను గుర్తుచేసుకున్న రిషి భట్​ టూరిస్ట్, జిప్​లైనింగ్ చేస్తుండగా ఉగ్రవాదుల కాల్పులను చూసి తాను, తన కుటుంబం తృటిలో ఎలా తప్పించుకున్నామో వివరించారు.

రిషి భట్ జిప్లైనింగ్ మొదలు పెట్టగానే ఆపరేటర్ అతడిని విడిపించే ముందు మూడుసార్లు 'అల్లాహు అక్బర్' అని నినదించాడు. భట్ నవ్వుతూ రైడ్​ను ఆస్వాదించడం వీడియోలో చూడవచ్చు. కానీ బ్యాక్​గ్రౌండ...