భారతదేశం, ఏప్రిల్ 27 -- టీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇక కశ్మీర్‌లో పర్యాటకం గురించి కాస్త ఆందోళన మెుదలైంది. కానీ ఉగ్రదాడి జరిగిన ఐదు రోజులకే మెల్లమెల్లగా పర్యాటకులు రావడం మెుదలైంది. 26 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాద దాడితో దెబ్బతిన్న పహల్గామ్, కశ్మీర్ లోయలో వేసవిని ఆస్వాదించాలనుకునే పర్యాటకులతో తిరిగి పుంజుకున్నట్లు కనిపిస్తోంది,

మినీ స్విట్జర్లాండ్ పహల్గామ్ దాడి జరిగిన రెండు రోజుల తర్వాత పర్యాటకుల కోసం తెరిచారు. అయితే దాడి జరిగిన గ్రౌండ్ జీరో, బైసరన్ గడ్డి మైదానం ఇప్పటికీ మూసివేసే ఉంచారు. పచ్చిక బయలు చుట్టూ ఉన్న పైన్ అడవుల నుండి ఉగ్రవాదులు వచ్చి పర్యాటకులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తర్వాత పర్యాటక కేంద్రం దాదాపు ఖాళీ అయిపోయింది.

రోజుకు 5,000 నుండి 7,000 మంది సందర్శకులతో కిటకిటలాడే ఈ ప్రాంతంలో ప్రస...