Hyderabad, మే 12 -- పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. కానీ వాటిని సరైన పద్ధతిలో తింటేనే ఆ ఆరోగ్యం మనకు పూర్తిగా అందుతుంది. చాలామంది పండ్లను ఎప్పుడంటే అప్పుడు తింటారు. భోజనం చేశాక వెంటనే, లేదంటే ఖాళీ కడుపుతో తింటుంటారు. ఇలా తింటే ఒక్కోసారి గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయి.

పండ్ల విషయంలో చాలా మందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మన వంటింట్లో ఉండే కొన్ని మసాలా దినుసులు ఈ పండ్ల రుచిని పెంచడమే కాకుండా, వాటిని మరింత ఆరోగ్యకరంగా మారుస్తాయి. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. పండ్లను కొన్ని ప్రత్యేకమైన మసాలాతో కలిపి తింటే అవి మన శరీరానికి మరింత బలాన్నిస్తాయి. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇందులో నిజం ఉంది. పండ్లను మసాలాలతో కలిపి తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రండి మసాలా దినుసులతో కలిపి ...