భారతదేశం, ఫిబ్రవరి 23 -- బలవంతపు మత మార్పిడుల నేపథ్యంలో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ 2' మూవీ విడుదలకు ముందే దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ సినిమాలో తప్పుడు విషయాలు చూపించారని, ఇదొక ప్రాపగాండా మూవీ అని వస్తున్న విమర్శలపై దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ తీవ్రంగా స్పందించాడు. డాక్యుమెంటరీలు తీసిన అనుభవంతో, లోతైన పరిశోధన తర్వాతే ఈ సినిమా తీశానని.. ఇందులో ఏమైనా తప్పు ఉందని నిరూపిస్తే తాను సినిమాలు తీయడం మానేస్తానని ఆయన సవాల్ విసిరాడు.

కేరళలో జరిగిన బలవంతపు మత మార్పిడులు, చిత్రహింసలకు గురైన ముగ్గురు యువతుల కథతో వస్తున్న బాలీవుడ్ మూవీ 'ది కేరళ స్టోరీ 2'. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇందులో చూపించిన అంశాలు అతిశయోక్తిగా ఉన్నాయని, ఇదొక ప్రాపగాండా అని పలువురు రాజకీయ నాయకులు,...