Hyderabad, మే 20 -- అల్జీమర్స్ లేదా మతిమరుపు వ్యాధి అనేది వయసుతో ముడిపడి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఎంతోమందిలో ఈ సమస్య కనిపిస్తోంది. ఇప్పుడు ఒత్తిడి కారణంగా మానసిక సమస్యల కారణంగా ముందుగానే అల్సీమర్స్ వచ్చేస్తోంది.

చెడు జీవన శైలి కారణంగా కూడా అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ప్రతిరోజూ మూడు రకాల పానీయాలు తాగుతారో వారు అల్జీమర్స్ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

చల్లటి డైట్ సోడా, చక్కెర నిండిన కాఫీ, వెన్న తీసిన పాలు... ఈ మూడూ ప్రతిరోజు కొంచెం తాగిన చాలు త్వరలోనే మీరు అల్జీమర్స్ వ్యాధిని బారిన పడే అవకాశం ఉందని సైన్సు చెబుతోంది.

న్యూరో సైంటిస్టులు చెబుతున్న ప్రకారం ఈ సాధారణ పానీయాలు అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయని తెలుస్తోంది. వీటిని అప్పుడప్పుడు తీసుకోవడం కూడా దీర్ఘకాలిక హానిని కలిగిస్తాయి. ఇక రోజువారి అలవాట...