భారతదేశం, మే 26 -- ల్ఫ్ దేశం కువైట్ రాత్రికి రాత్రే 37,000 మంది పౌరసత్వాన్ని రద్దు చేసింది. వీరిలో ఎక్కువ మంది వివాహం ద్వారా పౌరసత్వం పొందిన మహిళలు ఉన్నారు. కొందరు 20 సంవత్సరాలకు పైగా కువైట్‌లో నివసిస్తున్నారు. చాలామంది పనుల్లోకి వెళ్లిన తర్వాత ఈ విషయం తెలిసింది.

50 ఏళ్ల లామా అనే మహిళ వ్యాయామ తరగతిలో ఉన్నప్పుడు తన క్రెడిట్ కార్డ్ చెల్లింపు తిరస్కరణకు గురైంది. దీని గురించి తెలుసుకుంది. గందరగోళానికి గురయ్యేలోపే ఆమె బ్యాంక్ ఖాతా కూడా స్తంభించిపోయింది. కారణం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది. 20 సంవత్సరాలకు పైగా కువైట్ పౌరురాలిగా జీవించిన తర్వాత, ఆమె జాతీయత రద్దు అయింది. లామా వివాహం ద్వారా కువైట్ పౌరురాలు అయ్యారు.

ఇలా 37,000 మందికి పైగా మంది పౌరసత్వం రద్దు చేశారు. ఇందులో ఎక్కువగా మహిళలు ఉన్నారు. ఆగస్టు 2024 నుండి, కువైట్ అధికారులు పౌరసత్వాన్న...