భారతదేశం, ఫిబ్రవరి 10 -- ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రాయలసీమ జిల్లాల మీదుగా కాచిగూడ-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్టుగా ప్రకటించింది. కాచిగూడ నుంచి తిరుపతి వెళ్లే రైలు 07511 ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ఈ నెల 12వ తేదీన గురువారం రాత్రి 10:40 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

ఈ రైలు ఉందానగర్, షాద్‌నగర్, జడ్జర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

మార్చి 4వ తేదీన హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ఇబ్బంది లేని ప్రయాణం కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. 160 ప్రత్యేక రైళ్లను నడపాలని ప్రణా...