భారతదేశం, డిసెంబర్ 1 -- గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల పండుగ మెుదలైంది. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఉన్న సమస్యలను జనాలు ముందుకు తీసుకువస్తున్నారు. పరిష్కారం చూపినవారికే ఓటు వేస్తాం లేదంటే ఏకగ్రీవం చేస్తామంటూ చెబుతున్నారు. వరంగల్ జిల్లాలో ఓ గ్రామం కోతుల సమస్యను తీర్చినవారికే తమ ఓటు అంటూ తీర్మానం చేసుకుంది.
వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామస్థులు కోతుల బెడదను అదుపు చేస్తామని హామీ ఇచ్చే అభ్యర్థిని సర్పంచ్గా ఎన్నుకుంటామని ఏకగ్రీవంగా ప్రకటించారు. 5,400 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో 20,000 కంటే ఎక్కువ కోతులు ఉన్నాయి. ఇది ఇక్కడ జనాభా కంటే నాలుగు రెట్లు ఎక్కువ. కోతులతో రోజువారీ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనాలు. కోతులు ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్నాయి కూడా. వంట పాత్రలను దొంగి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.