Hyderabad, జూన్ 12 -- పూరీలో జరిగే రథయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఏటా జరిగే రథయాత్రకు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. 15 రోజుల పాటు, తొమ్మిది రోజులు జరిగే ఈ పండుగలో అనేక క్రతువులు ఉంటాయి. పూరీలో జరిగే రథయాత్ర స్నాన పౌర్ణమితో మొదలవుతుంది.

తిరిగి దేవతలు ప్రధాన దేవాలయానికి చేరుకోవడంతో రథయాత్ర ముగుస్తుంది. ఇది కేవలం ఒడిశాలో జరిగే మాములు వేడుక కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు పాల్గొనే వేడుక. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది రథయాత్ర చూడడానికి వస్తారు. అతి సుందరంగా అలంకరించిన రథాలలో దేవతలను ఊరేగించి గుండిచ ఆలయానికి తీసుకెళ్లడం జరుగుతుంది.

జగన్నాథ రథయాత్ర ఈసారి జూన్ 27న మొదలవుతుంది, జూలై 5 వరకు కొనసాగుతుంది. తొమ్మిది రోజులు పాటు అనేక క్రతువులతో ఈ రథయాత్రను జరుపుతారు.

ప్రతి ఏటా ఆషాఢ మాసం శుక్లపక్ష విద్య నాడు రథయ...