భారతదేశం, మే 22 -- హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 80 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జూన్‌ 5వ తేదీతో గడువు ముగుస్తుంది.

ఈ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే వారు 2025 ఏప్రిల్ 30వ తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి. ఈ పోస్టులను ఈసీఈ/ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్ టెలీ కమ్యూనికేషన్‌, ఈఅండ్ఐ, ఇనుస్ట్రుమెంటేషన్‌, సీఎస్‌ఈ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, ఈఈఈ/ఎలక్ట్రికల్‌, సివిల్‌, కెమికల్‌ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 మధ్య జీతం చెల్లిస్తారు.

మొత్తం 80 పోస్టులు ఉండగా.. వీటిలో ఓపెన్ కేటగిరిలో 38 ఉన్నాయి. ఓబీ...