భారతదేశం, జూన్ 10 -- షాడ మాసం బోనాలకు తెలంగాణ సిద్ధమవుతోంది. డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డి ఇన్‌స్టిట్యూట్‌లో ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడానికి చేయాల్సిన ఏర్పాట్లపై మంత్రులు, అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈసారి బోనాల కోసం రాష్ట్రప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది.

ఎండోమెంట్ శాఖ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలకు ఈ నిధులు విడుదల చేస్తారు. ఈ నిధులను దేవాలయాలకు రంగురంగుల పూలు, ఎల్ఈడీ లైట్లతో అలంకరించడంతో పాటు, వాటికి రంగులు వేయడంలాంటి పనులకు ఉపయోగిస్తారు. ఉత్సవాల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలోని 28 ముఖ్యమైన దేవాలయాలలో పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.

ఉత్సవాల సందర్భంగా వీఐపీల కదలికల సమయంలో తొక్కిసలాటలు జరుగుతున్నాయని, అందువల్ల తొక్కిసలాట వంటి పరిస్థితులు జరగకుండా చూడాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈసారి వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం వి...