భారతదేశం, మే 27 -- టీడీపీ కార్యకర్తులు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అదే జోరు కొనసాగుతోందని... టీడీపీ చరిత్రలో తొలిసారి దేవుని గడపలో... కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మహానాడును కడపలో టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

కడప గడ్డలో జరుగుతున్న మహానాడు చూస్తుంటే ఎన్నికలై ఏడాది గడిచినా మీలో ఉత్సాహం, ఉద్వేగం, ఉద్రేకం తగ్గలేదన్నారు.టీడీపీలో ఇప్పటి వరకు 34 మహానాడులు జరిగాయని, రెండు డిజిటల్‌గా జరిగాయని, దేవుని గడపలో జరుగుతున్న మహానాడు ఓ చరిత్ర సృష్టించబోతుందన్నారు.

కడప మహానాడు ఆంధ్ర రాష్ట్రానికి దశదిశ నిర్దేశం చేస్తుందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో కడపలో మహానాడు జరుగుతోందని చెప్పారు..

గత ఉమ్మడి 10 స్థానాల్లో 7 స్థానాలు గెలిచామని, ఇంకాస్త కష్టపడితే ఈసారి పదికి పది మనమే గెలుస్తామన్నారు. కడపలో ఇకపై టీ...