భారతదేశం, డిసెంబర్ 18 -- తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 29 నుంచి జనవరి 2వ తేదీ వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఐదు రోజులపాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటిరోజైన డిసెంబరు 29వ తేదీన శ్రీ వినాయక స్వామివారు, శ్రీ చంద్రశేఖర్ స్వామివారు పుష్కరిణిలో 9 చుట్లు విహరిస్తారు.
నవంబరు 30న శ్రీ వళ్ళి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారు 9 చుట్లు, డిసెంబరు 31న శ్రీ సోమస్కందస్వామివారు 9 చుట్లు, జనవరి 1న శ్రీ కామాక్షి అమ్మవారు 9 చుట్లు, జనవరి 2న శ్రీ చండికేశ్వరస్వామివారు మరియు శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై 9 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.
ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఊంజల సేవ, తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. జనవరి 3వ తేదీన ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 6 నుండి రాత్రి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.