భారతదేశం, మే 11 -- మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా బాచుపల్లి ఎమ్మార్వో ఇచ్చిన నోటీసులతో హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసలు ఈ విషయం గురించి తనకు కానీ హైడ్రా అధికారులకు గానీ తెలియదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని మేడ్చల్ - మల్కాజ్ గిరి కలెక్టర్ తో కూడా మాట్లాడానని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.

ఆ నోటీసులు ఎందుకు ఇచ్చారో ఎమ్మార్వోను అడగాలని కలెక్టర్ కోరినట్టు కమిషనర్ తెలిపారు. ప్రతీ నోటీస్ ను, ప్రతీ కూల్చివేతను హైడ్రాకు ఆపాదించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడం దురదృష్టం అన్నారు. బడా భూ కబ్జాదారుల మీద హైడ్రా కఠినంగా ఉంటూ, సామాన్యులకు అండగా ఉంటుందన్నారు.

కలెక్టర్ కి కూడా తెలియకుండానే బాచుపల్లి ఎమ్మార్వో నోటీసులు ఇచ్చారని మల్కాజిరి ఎంపీ ఈటల రాజేందర్ ఒకవైపు చెబుతూనే ఎంతో నిబద్ధతో పని చేస్త...