Telangana,hyderabad, జూన్ 8 -- హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఇవాళ, రేపు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లను చేసింది. ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిన సోదరులు ప్రతి ఏడాది ఏటా ఉచితంగా ఈ ప్రసదాన్ని పంపిణీ చేస్తుంటారు.

మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ సారి పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభించనున్నారు. ఇప్పటికే చాలా మంది తరలివచ్చారు. ఈ సంఖ్యలో పెద్ద ఎత్తులో ఉంటుంది. ఈ ఏడాది దాదాపు 40కి పైగా క్యూలైన్లను ఏర్పాట్లు చేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....