భారతదేశం, మే 10 -- జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్నసీతే రాముడి క‌ట్నం సీరియ‌ల్‌కు మేక‌ర్స్ శ‌నివారం శుభం కార్డు వేశారు. స‌రైన ఎండింగ్ అన్న‌ది లేకుండా అర్థాంత‌రంగా ఈ సీరియ‌ల్‌ను ముగించేశారు. 502 ఎపిసోడ్స్‌తో సీతే రాముడి క‌ట్నం సీరియ‌ల్ ఎండ‌య్యింది.

ప్రాప‌ర్ క్లైమాక్స్ అంటూ లేకుండా సీతేరాముడి క‌ట్నం సీరియ‌ల్‌ను ముగించ‌డం ప‌ట్ల బుల్లితెర ఫ్యాన్స్ హార్ట‌వుతున్నారు. జీ తెలుగును ట్రోల్ చేస్తోన్నారు. ఇది ఎక్స్‌పెక్ట్ చేయ‌లేద‌ని, ఇలా కూడా సీరియ‌ల్‌ను ముగిస్తారా అంటూ కామెంట్స్ చేస్తోన్నారు. మ‌రికొంత నెటిజ‌న్లు మాత్రం సీరియ‌ల్ చాలా బోరింగ్‌గా సాగుతుంద‌ని, ఎండ్ చేసి మంచి ప‌ని చేశార‌ని అంటున్నారు. సీతే రాముడి క‌ట్నం సీరియ‌ల్ స్థానంలో సోమ‌వారం నుంచి ఘ‌రానా మొగుడు సీరియ‌ల్ టెలికాస్ట్ కాబోతోంది.

సీతేరాముడి క‌ట్నం సీరియ‌ల్‌లో స‌మీర్, వైష్ణ‌వి లీడ్ రోల్స...