భారతదేశం, మే 8 -- మ‌ల‌యాళం హార‌ర్ మూవీ హంట్ థియేట‌ర్ల‌లో రిలీజైన ఎనిమిది త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌, స్ట్రీమింగ్ డేట్ క‌న్ఫామ్ అయ్యాయి. మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో మే 23 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

భావ‌న హీరోయిన్‌గా న‌టించిన హంట్ మూవీలో రెంజీ ఫ‌ణిక్క‌ర్‌, అజ్మ‌ల్ అమీర్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ హార‌ర్ మూవీకి మ‌ల‌యాళం సీనియ‌ర్ డైరెక్ట‌ర్ షాజీ కైలాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కాన్సెప్ట్ రొటీన్ అయినా నాన్ లీనియ‌ర్ స్క్రీన్‌ప్లే ఈ మూవీని తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాల‌ని అనుకున్నారు ద‌ర్శ‌కుడు షాజీ కైలాస్.. కానీ ఈ ప్ర‌యోగం అంత‌గా స‌క్సెస్ కాలేదు.

కానీ ట్విస్ట్‌ల‌తో పాటు క్లైమాక్స్ ఎపిసోడ్ ...