భారతదేశం, మే 15 -- లేటెస్ట్ తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ చౌర్య పాఠం ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్‌కు మాత్ర‌మే ప్ర‌స్తుతం ఈ మూవీ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ వారంలోనే అమెజాన్ ప్రైమ్ ద్వారానే ఇండియ‌న్ ఆడియెన్స్ ముందుకు చౌర్య పాఠం మూవీ రాబోతున్న‌ట్లు స‌మాచారం.

చౌర్య పాఠం మూవీలో ఇంద్ర‌రామ్‌, పాయ‌ల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా న‌టించారు. మ‌స్త్ అలీ, రాజీవ్ క‌న‌కాల కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాలో లేడీ విల‌న్‌గా సుప్రియ ఐసోల అద‌గొట్టింది. ఆమె క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఈ క్రైమ్ కామెడీ మూవీకి ఈగ‌ల్ డైరెక్ట‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మేని క‌థ‌ను అందించారు. ధ‌మాకా డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు న‌క్కిన చౌర్య పాఠం సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. నిఖిల్ ద‌ర్శ...