భారతదేశం, జూన్ 23 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1046 పాయింట్లు పెరిగి 82,408 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 319 పాయింట్లు వృద్ధిచెంది 25,112 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 675 పాయింట్లు పెరిగి 56,253 వద్దకు చేరింది.

ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు ఉన్న విషయం తెలిసిందే. కానీ ఆదివారం అమెరికా కూడా ఇరాన్​పై దాడులు చేయడంతో ప్రపంచ దేశాలు ఉల్లికిపడ్డాయి. మూడు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. అమెరికా దాడులతో ఇరాన్​.. స్టైట్​ ఆఫ్​ హార్ముజ్​ని మూసివేస్తామని హెచ్చరించింది. ఈ జలసంధి ప్రపంచ ముడి చమురు సరఫరాకు అత్యంత కీలకమైనది. ఇరాన్​ ఈ పనిచేస్తే ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతాయని మదుపర్లలో భయం మొదలైంది. ముడి చమురు ధరలు పెరగడం స్టాక్​ మార్కెట్​...