భారతదేశం, ఆగస్టు 20 -- గత కొన్ని రోజులుగా ఒత్తిడిలో ఉన్న ఐటీ సెక్టార్ షేర్లు బుధవారం ఒక్కసారిగా పుంజుకున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 2.70% పెరిగింది. ఇది మే 2025 తర్వాత ఒకే రోజులో సాధించిన అతిపెద్ద లాభం. ఇన్ఫోసిస్, కోఫోర్జ్, ఎంఫసిస్ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు 4% వరకు లాభపడ్డాయి.
ఈ ర్యాలీలో ఇన్ఫోసిస్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ షేర్ 4% పెరిగి Rs.1,497కు చేరుకుంది. ఆ తర్వాత కోఫోర్జ్ 3.3%, ఎంఫసిస్ 3.2% లాభపడ్డాయి. టీసీఎస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, టెక్ మహీంద్రా, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, విప్రో, ఎల్టీఐమైండ్ట్రీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటి ఇతర ఐటీ స్టాక్స్ కూడా 1.5% నుంచి 3% మధ్య లాభాలతో ముగిశాయి.
ఐటీ స్టాక్స్ పుంజుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
తగ్గిన ధరలు: గత కొన్ని వారాలుగా ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు జరగడం వల్ల వాటి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.