Hyderabad, మే 18 -- బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు.

భైరవం చిత్రంలో హీరోయిన్స్‌గా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై నటించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేశాయి. భైరవం ఈ సమ్మర్ బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌‌‌గా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ కనకమేడల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

-కథ కమర్షియల్‌గా నాకు చాలా నచ్చింది. అలాగే ముగ్గురు హీరోలతో వర్క్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఓకే చేశాను. ఒరిజినల్‌లో ఉన్న ఆర్గానిక్ ఎమోషన్ ఇందులో ఉంటు...