Hyderabad, అక్టోబర్ 3 -- శ్రేయాస్ చిత్ర, పూర్ణా నాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద చైతన్య రావు మదాడి హీరోగా పూర్ణా నాయుడు, శ్రీకాంత్. వి ప్రొడక్షన్ నెంబర్. 5 ని ప్రారంభించారు. ఈ సినిమాతో ఐరా, సాఖీ ఇద్దరు కొత్త హీరోయిన్లు టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు.

'ఓనమాలు', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'వరల్డ్ ఫేమస్ లవర్' అంటూ సెన్సిబుల్ స్టోరీలతో ఆకట్టుకున్న సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇప్పుడు మరో యూత్ ఫుల్ కథతో అందరినీ అలరించేందుకు ఈ సినిమాతో రెడీగా ఉన్నారు. కొంచెం గ్యాప్ తరువాత వస్తున్న క్రాంతి మాధవ్ సరికొత్త ప్రేమ కథతో అందరినీ మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

దసరా సందర్భంగా ఈ మూవీని ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 3) నాడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. మ...