భారతదేశం, మే 27 -- గల్లీ క్రికెట్లోనే ఏ టీమ్ కూడా 2 రన్స్ కు ఆలౌట్ కాదు. కానీ ఇంగ్లాండ్ లోని మిడిలెసెక్స్ కౌంటీ లీగ్ లో మాత్రం ఆ విచిత్ర సంఘటన జరిగింది. ఓ టీమ్ కేవలం రెండు పరుగులకే కుప్పకూలింది. ఇందులో ఒకటి వైడ్ కావడం గమనార్హం. అంటే 11 మంది బ్యాటర్లు కలిసి చేసింది ఒక్కటంటే ఒక్క పరుగు మాత్రమే. మిడిలెసెక్స్ కౌంటీ లీగ్ లో నార్త్ లండన్ సీసీ, రిచ్మండ్ ఫోర్త్ ఎలెవన్ జట్ల మధ్య మ్యాచ్ లో ఇది జరిగింది.

మిడిలెసెక్స్ కౌంటీ లీగ్ మూడో టైర్ డివిజన్ వన్ మ్యాచ్ లో నార్త్ లండన్ 3, రిచ్మండ్ 4 టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన నార్త్ లండన్ టీమ్ 45 ఓవర్లలో 6 వికెట్లకు 426 పరుగులు చేసింది. డానియల్ సిమన్స్ (140) భారీ సెంచరీ బాదాడు. జాక్ లెవిట్ (43), నబిల్ (42) కూడా రాణించాడు.

నార్త్ లండన్ తో మ్యాచ్ లో ఛేజింగ్ లో రిచ్మండ్ 4 దారుణమైన ప్...