భారతదేశం, మే 4 -- ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ బెన్ గురియన్ విమానాశ్రయం సమీపంలో క్షిపణి దాడి జరిగింది. అనంతరం ఎయిరిండియా విమానాన్ని అబుదాబికి దారి మళ్లించారు. ఈ విమానం దిల్లీ నుంచి టెల్ అవీవ్ నగరం వెళ్తోంది. ఆదివారం విమానాశ్రయం సమీపంలో క్షిపణి దాడి జరిగింది. ఎయిరిండియాకు చెందిన ఏఐ139 విమానం టెల్ అవీవ్‌లో ల్యాండ్ కావడానికి గంట ముందు ఈ దాడి జరిగింది. అధికారులు అబుదాబీకి దారి మళ్లించారు.

విమానాన్ని తిరిగి దిల్లీకి తీసుకురానున్నట్లు పీటీఐ వార్తా సంస్థ వర్గాలు తెలిపాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ Flightradar24.com అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, విమానం అబుదాబికి దారి మళ్లించిన సమయంలో జోర్డాన్ గగనతలంలో ఉంది. మరోవైపు టెల్ అవీవ్ నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాన్ని ఆదివారం రద్దు చేశారు.

ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసం టెల్ అవీవ్‌కు, అక్...