భారతదేశం, ఏప్రిల్ 28 -- ఏదైనా కారు కొనుగోలు చేయాలంటే మైలేజ్​ మాత్రమే కాదు, ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్​ని కూడా చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్న అనేక కుటుంబాలు సేఫ్టీ విషయంలో రాజీపడటం లేదు. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్​ సంస్థలు సైతం తమ వాహనాల్లో అధిక సేఫ్టీ ఫీచర్స్​ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమ్మకాల పరంగా దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ కూడా ఇప్పుడు సేఫ్టీపై మరింత ఫోకస్​ చేసింది. ఈ నేపథ్యంలోనే తన పోర్ట్​ఫోలియోలోని అన్ని మోడల్స్​కి 6 ఎయిర్​బ్యాగులు ఫిట్​ చేసేందుకు సంస్థ రెడీ అవుతోంది. అంతేకాదు, ఈ సేఫ్టీ ఇచ్చి, సంస్థ వాహనాల ధరలను మరోసారి పెంచే అవకాశం కూడా ఉంది!

దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఇప్పుడు తన మొత్తం ప్యాసింజర్ వాహనాల శ్రేణిలో ఆరు ఎయిర్​బ్యాగులను స్టాండర్డ్ ఫిట్​మెంట్​గా అ...