భారతదేశం, మే 22 -- ర్ణాటక ప్రభుత్వానికి చెందిన కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌కు ప్రముఖ నటి తమన్నా భాటియా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేఎస్‌డీఎల్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా భాటియా 2 సంవత్సరాల 2 రోజుల కాలానికి రూ.6.20 కోట్లు చెల్లిస్తున్నారు.

ఇక మైసూర్ శాండల్ సోప్ ప్రచారంలో కూడా తమన్నా భాగం కానుంది. కర్ణాటక ప్రభుత్వం మైసూర్ శాండల్ సబ్బు అమ్మకాలను పెద్ద ఎత్తున పెంచాలని భావిస్తోంది. దీని కోసం ప్రస్తుతం జాతీయ స్థాయిలో పేరు ఉన్న తమన్నా భాటియాను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకువచ్చింది.

అంతకుముందు మహేంద్ర సింగ్ ధోని 2006లో మొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. కానీ కేఎస్‌డీఎల్ డిసెంబర్ 2007లో అతని ఒప్పందాన్ని రద్దు చేసింది. ప్రమోషన్ కోసం అంగీకరించిన సమయం ఇవ్వడం లేదని పే...