భారతదేశం, ఫిబ్రవరి 24 -- దక్షిణ భారత రాష్ట్రం 'కేరళ' పేరు త్వరలోనే అధికారికంగా మారనుంది. మలయాళీలు తమ రాష్ట్రాన్ని ఎంతో ఇష్టంగా పిలుచుకునే 'కేరళం' అనే పేరునే ఇకపై అన్ని భాషల్లోనూ అధికారికంగా వాడనున్నారు. ఈ మేరకు కేరళ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది.

రాష్ట్రం పేరు మార్చడం అనేది రాజ్యాంగంలోని 3వ అధికరణ (Article 3) పరిధిలోకి వస్తుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత, ఇకపై ప్రక్రియ ఇలా సాగనుంది.

ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం 2023, 2024లో రెండుసార్లు అసెంబ్లీలో దీనిపై తీర్మానం చేసింది. "మలయాళ భాషలో మా రాష్ట్రం పేరు 'కేరళం'. 1956 నవంబర్ 1న భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఇది ఏర్పడింది. అప్పటి నుంచే 'యునైటెడ్ కేరళం' కోసం ఉద్యమం సాగింది. కానీ రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో మాత్రం కేరళ అన...