భారతదేశం, ఏప్రిల్ 26 -- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ఇందిరమ్మ ఇండ్లు. ఈ పథకం కింద లబ్ధిదారులకు నాలుగు దశల్లో బిల్లులు చెల్లిస్తారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయి. ఇంటి నిర్మాణం ఏ దశలో ఉన్నప్పుడు ఎంత బిల్లు వస్తుంది.. ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పునాది నిర్మాణం పూర్తయిన తర్వాత లబ్ధిదారుల ఖాతాలో రూ. 1 లక్ష ఖాతాలో జమ చేస్తారు.

గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత లబ్ధిదారుల ఖాతాలో రూ. 1.25 లక్షలు ఖాతాలో జమ చేస్తారు.

స్లాబ్ నిర్మాణ సమయంలో లబ్ధిదారులకు రూ. 1.75 లక్షలు ఖాతాలో జమ చేస్తారు.

ఇంటి నిర్మాణం పూర్తిగా పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు రూ. 1 లక్ష ఖాతాలో జమ చేస్తారు. మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది.

ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు కోసం ప్రభుత్వం ఔట్‌స...