భారతదేశం, ఏప్రిల్ 28 -- ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో సమస్యలు ఎదురవుతున్నాయి. కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులపై ఒత్తిడి పెరిగింది. అయితే ఈ పథకం ముదుకు సాగాలంటే.. భవన నిర్మాణ పనులు చేపట్టే తాపీ మేస్త్రీలు కీలకం. కానీ ప్రస్తుతం సరిపడా లేరు. దీంతో ప్రభుత్వ ఆదేశంతో అధికారులు దృష్టిపెట్టారు. గ్రామాల్లో కొరత ఉండటంతో.. ఎంపిక చేసిన కొందరికి శిక్షణ ఇప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు.

యువత అన్ని రంగాల్లో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ భవన నిర్మాణ రంగానికి వచ్చేసరికి విముఖత కనబరుస్తున్నారు. దీంతో శిక్షణ ఇప్పించడం కూడా అధికారులకు కష్టంగా మారుతోంది. అయినా కొందరిని ఎంపిక చేసి.. నిర్మాణ పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు, మెలకువలు ఇతర అంశాలపై నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించనున్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం రూ.5...