భారతదేశం, మే 2 -- ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి 3 నెలల కిందట ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో మంజూరు చేసిన ఇండ్ల లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధానంగా నిర్మాణం ప్రారంభించడానికి ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, కారణాలు ఇలా ఉన్నాయి.

1.మొదటి విడతలో భాగంగా మండలానికి ఒక్కో గ్రామం చొప్పున ఎంపికచేశారు. మొత్తం 70,122 ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిలో 46,432 మందికి మంజూరుపత్రాలను అందజేశారు. ఇందులో 16,189 మంది ఇంతవరకు ఇంటి నిర్మాణపనులను ప్రారంభించారు.

2.ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నాలుగు విడతలుగా రూ.5 లక్షలను లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. నిర్మాణదశలకు అనుగుణంగా ఈ మొత్తం విడుదల చేస్తారు. 2,341 మందికి మొదటిదశ చెల్లింపులో భాగంగా రూ.లక్ష చొప్పున మంజూరైంది....