Hyderabad, జూన్ 2 -- బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన లేటెస్ట్ మూవీ భైరవం. తమిళ సూపర్ హిట్ మూవీ గరుడన్‌కు రీమేక్‌గా తెలుగులో వచ్చిన భైరవంకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధా మోహన్ భారీగా నిర్మించారు.

మే 30న ప్రపంచవ్యాప్తంగా భైరవం సినిమా విడుదల అయింది. థియేటర్లలో రిలీజ్ అయిన భైరవం అద్భుతమైన రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ బ్లాక్ బస్టర్ బీభత్సం భైరవం క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

-ఈ సినిమాలో నా పర్ఫామెన్స్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఇలాంటి కథ దొరిక...